Mayank Yadav | బెంగళూరు: ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న లక్నో సూపర్జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్..భవిష్యత్లో భారత్కు ఆడటమే తన లక్ష్యమని ప్రకటించాడు. మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో మూడు కీలక వికెట్లు తీసిన మయాంక్ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
ఈ నేపథ్యంలో మయాంక్ స్పందిస్తూ ‘చాలా సంతోషంగా ఉంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో రెండుసార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాను. దేశం తరఫున ఆడటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే. గ్రీన్ వికెట్ను బాగా ఎంజాయ్ చేశాను’ అని అన్నాడు.