ఆంటిగ్వా: వెస్టిండీస్ చెలరేగింది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకున్నది. డారెన్ సమీ స్టేడియంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్తో 16 రన్స్ తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 రన్స్ చేసింది. ఓపెనర్ లివిస్ 34 బంతుల్లో శరవేగంగా 79 రన్స్ చేశాడు. 1995 తర్వాత వెస్టిండీస్ తన స్వంత గడ్డపై ఓ సిరీస్ను గెలవడం ఇదే తొలిసారి. కీరన్ పోలార్డ్ గాయపడడంతో.. సిరీస్ మొత్తం అతని స్థానంలో నికోలస్ పూరన్ స్టాండ్ ఇన్ కెప్టెన్గా వ్యవహరించారు. 200 టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 20 ఓవర్లలో 183 రన్స్ చేసింది. ఆసీస్ జట్టులో కెప్టెన్ ఫించ్ అత్యధికంగా 34 రన్స్ చేశాడు. కాట్రల్, రసెల్ను చెరో మూడేసి వికెట్లు తీసుకున్నారు.