IND vs WI : భారత్, వెస్టిండీస్ జట్లు కీలకమైన మూడో టీ20 పోరుకు సిద్దమయ్యాయి. గయానా(Guyana)లోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ రొవమన్ పావెల్(Rovman Powell) బ్యాటింగ్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) సారథ్యంలోని యువ భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.
ఇషాన్ కిషన్ ప్లేస్లో యశస్వీ జైస్వాల్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్తో అతను టీ20ల్లో అరంగేట్రం చేస్తున్నాడు. రవి బిష్ణోయ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడుతున్నాడు. విండీస్ జట్టు హోల్డర్ బదులు రోస్టన్ ఛేజ్ను ఆడిస్తోంది. సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్ టీమిండియాకు చావో రేవో లాంటిది.
భారత జట్టు : యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమర్.
వెస్టిండీస్ జట్టు : కైలీ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సస్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మైర్, రొవ్మన్ పావెల్(కెప్టెన్), రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, అకీల హొసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్.