పెర్త్: పేసర్లు సత్తాచాటడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. లబుషేన్, స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీలతో మొదట ఆసీస్ 598 పరుగుల భారీ స్కోరు చేయగా.. విండీస్ తొలి ఇన్నింగ్స్లో 283 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్వైట్ (64), తేజ్నారాయణ్ చందర్పాల్ (51) హాఫ్సెంచరీలు నమోదు చేసుకున్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న ఆతిథ్య జట్టు ప్రస్తుతం 344 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఉస్మాన్ ఖవాజా (5) ఔట్ కాగా.. వార్నర్ (18), లబుషేన్ (3) క్రీజులో ఉన్నారు.