భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో భాగంగా నాలుగో రోజు ఆటలో.. భారత ఆటగాళ్లు శార్దూల్, పంత్ దూసుకుపోయారు. మరో హాఫ్ సెంచరీ చేసి శార్దూల్ క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచాడు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. మూడో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఉన్నారు.
ఇక.. భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్లో 300 పైగా ఆధిక్యంలో దూసుకుపోతోంది. మరోవైపు శార్దూల్ హాఫ్ సెంచరీ చేశాడు. పంత్ కూడా.. శార్దూల్తో కలిసి భారత్కు పరుగులు అందించాడు. ఈ సిరీస్లో తొలి హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు పంత్.
పంత్ హాఫ్ సెంచరీ చేసి ఔట్ కాగా.. శార్దూల్ 60 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇప్పటి వరకు 8 వికెట్లు నష్టపోగా.. ప్రస్తుతం ఉమేశ్ యాదవ్, బుమ్రా క్రీజులో ఉన్నారు.