MS Dhoni : భారత క్రికెట్ జట్టు (Indian cricket team) మాజీ కెప్టెన్ (Former captain), మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని (MS Dhoni) జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Jarkhand assembly elections) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య సాక్షి (Sakshi) తో కలిసి రాంచి (Ranchi) లోని ఓ పోలింగ్ బూత్కు వచ్చిన ధోని ఓటు వేశారు. దంపతులిద్దరూ ఓటు వేసి బయటికి వచ్చిన అనంతరం ధోనీ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
కాగా రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జార్ఖండ్లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 20న రెండో విడత పోలింగ్ జరగనుంది. అదే రోజు మహారాష్ట్రలో కూడా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 23న రెండు రాష్ట్రాల్లో ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
కాగా, మహేంద్రసింగ్ ధోనీ దంపతులు రాంచిలో ఓటు వేసేందుకు రావడంతో వారిని చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. దాంతో సెక్యూరిటీ సిబ్బంది వారికి రక్షణ కవచంలా నిలిచి పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. ధోనీ దంపతులు ఓటు వేసేందుకు వచ్చిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | Former Indian cricket team captain MS Dhoni along with his wife, Sakshi arrives at a polling booth in Ranchi to cast his vote for #JharkhandAssemblyElections2024 pic.twitter.com/KlD68mXdzM
— ANI (@ANI) November 13, 2024