ENG vs PAK: వరల్డ్ కప్లో భారీ ఆశలతో అడుగిడి గ్రూప్ స్టేజ్ కూడా దాటకుండానే నిష్క్రమించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లే బాబర్ ఆజమ్ సేనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్ కంటే అఫ్గానిస్తాన్ చాలా బాగా ఆడిందని పాక్ మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, షోయభ్ మాలిక్ అన్నారు.
ఇటీవలే శ్రీలంకను న్యూజిలాండ్ చిత్తుచేయడంతో సెమీస్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించిన పాకిస్తాన్ ప్రదర్శనపై ఓ టీవీ చర్చలో మాలిక్ మాట్లాడుతూ.. ‘నా అభిప్రాయం ప్రకారం ఈ ప్రపంచకప్లో మన జట్టు కంటే అఫ్గానిస్తాన్ ప్రదర్శన నన్ను బాగా ఆకట్టుకుంది. వాళ్లు మనకంటే మెరుగైక క్రికెట్ ఆడారు..’ అని అన్నాడు. మాలిక్ వ్యాఖ్యలను అక్రమ్ సమర్థించాడు. అంతేగాక అక్రమ్ స్పందిస్తూ.. ‘అఫ్గాన్ జట్టు చాలా స్ట్రాంగ్గా కనిపించింది. మన ఆటగాళ్లు విరామం లేని క్రికెట్ ఆడటం వల్ల అలిసిపోయినట్టు కనిపించారు. కానీ అఫ్గాన్ క్రికెటర్లు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు.
కాగా వరల్డ్ కప్లో 9 మ్యాచ్లు ఆడిన అఫ్గాన్.. నాలుగింటిలో గెలిచి ఐదు మ్యాచ్లలో ఓడింది. ఆ జట్టు గెలిచిన జట్లు కూడా ఆషామాషీవి కాదు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో పాటు మాజీ ఛాంపియన్ పాకిస్తాన్, శ్రీలంకలను అఫ్గాన్ మట్టికరిపించింది. ఆస్ట్రేలియాపై గెలిచినంత పనిచేసింది. సౌతాఫ్రికాతో మ్యాచ్లో గెలుపు కోసం తుదికంటా పోరాడింది. ఇక పాకిస్తాన్.. 8 మ్యాచ్ (ఇంగ్లండ్తో మ్యాచ్ను పరిగణనలోకి తీసుకోకుండా) లు ఆడి నాలుగు గెలిచి నాలుగింటిలో ఓడింది. శ్రీలంక, నెదర్లాండ్స్పై గెలిచిన పాక్.. ఆ తర్వాత భారత్ చేతిలో ఓడి వరుసగా నాలుగు మ్యాచ్లలోనూ అపజయాలు ఎదుర్కుంది. ఎట్టకేలకు ఇటీవలే న్యూజిలాండ్తో మ్యాచ్లో గెలిచి సెమీస్ రేసులో నిలిచినా కోల్కతాలో ఇంగ్లండ్ టాస్ గెలవడంతో బాబర్ సేన కథ ముగిసింది.