న్యూఢిల్లీ: వేలి గాయంతో బాధపడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ త్వరలో జరుగనున్న ఐపీఎల్ రెండో దశకు దూరమయ్యాడు. ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్ ప్రాక్టీస్ సెషన్లో సుందర్ గాయపడ్డ విషయం తెలిసిందే. దాంతో సుందర్.. స్వదేశానికి తిరిగివచ్చాడు. ఇటీవలే ఎన్సీఏలో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షకు అతడు అర్హత సాధించలేదు.