ముంబై: ముంబై ఇండియన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. గత కొన్ని నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి ఐపీఎల్లో మ్యాచ్లో అతను తొలిసారి మళ్లీ మైదానంలోకి దిగాడు. గత మూడు నెలల నుంచి మూడు రకాల గాయాలతో ఇబ్బందిపడినట్లు సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఐపీఎల్ పోస్టు చేసిన వీడియోలో అతను ఈ విషయాన్ని చెప్పాడు. కానీ తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు చాలా కృషి చేసినట్లు చెప్పాడు. రికవరీ ప్రాసెస్ చాలా బోరింగ్గా సాగిందన్నాడు. స్పోర్ట్స్ హెర్నియాతో పాటు మడిమ సమస్యతోనూ బాధపడినట్లు తెలిపారు. వీటికి తోడు కుడి మోకాలికి కూడా గాయమైనట్లు సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. స్పోర్ట్స్ హెర్నియా చికిత్స కోసం సూర్య సర్జరీ చేయించుకున్నాడు.
𝗪𝗮𝗻𝘁𝗲𝗱 𝘁𝗼 𝗯𝗲 𝗮 𝗯𝗲𝘁𝘁𝗲𝗿 𝘃𝗲𝗿𝘀𝗶𝗼𝗻 𝗼𝗳 𝗺𝘆𝘀𝗲𝗹𝗳 𝗽𝗼𝘀𝘁 𝗶𝗻𝗷𝘂𝗿𝘆
With relentless focus and a disciplined routine, @surya_14kumar is ready to shine 💙
Here’s how SKY 2.0 looks like 😎👇 – By @Moulinparikh & @mihirlee_58#TATAIPL | #MIvRCB
— IndianPremierLeague (@IPL) April 10, 2024