న్యూఢిల్లీ: ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు వరుస సిరీస్లు ఆడనుంది. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్తో టీ20 సిరీస్, ఇంగ్లండ్తో ఐదో టెస్టుతోపాటు టీ20, వన్డే సిరీస్లు ఆడాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ప్రధాన కోచ్ బాధ్యతలను ఇద్దరు పంచుకోనున్నట్టు సమాచారం.
స్వదేశంలో సఫారీల సిరీస్కు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కొనసాగనుండగా.. ఐర్లాండ్ సిరీస్కు ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇక నిర్ణయాత్మక ఐదో టెస్టు కోసం ఇంగ్లండ్ పర్యటనకు రెగ్యులర్ కోచ్ ద్రవిడ్ వెళ్లనున్నాడు. ఐర్లాండ్తో జూన్ 26-28 మధ్య జరిగే రెండు మ్యాచ్ల టీ20 సిరీస్కు మాత్రం లక్ష్మణ్కు బాధ్యతలు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది.