హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఊపందుకుంది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ లావు నాగేశ్వర్రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్..మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ను నియమిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.
బహుళ క్లబ్ల ప్రాతినిధ్యం, పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణంగా ఇప్పటికే 57 క్లబ్లపై జస్టిస్ నాగేశ్వర్రావు వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్సీఏ నిబంధనలను (2018) అనుసరించి సంపత్ను నియమించినట్లు జస్టిస్ నాగేశ్వర్రావు పేర్కొన్నారు.