కోల్కతా: క్రికెట్ పరంగా సొంత రాష్ట్రంతో అనుబంధాన్ని భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా దాదాపుగా తెంచేసుకున్నాడు. ఇప్పటికే దేశవాళీ టోర్నీలో బెంగాల్ తరఫున ఆడేందుకు నిరాకరించాడు. ఈ విషయమై బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)తో చర్చించినట్లు సమాచారం. తాజాగా సాహా చేసిన వ్యాఖ్యలు ఇక బెంగాల్తో క్రికెట్ అనుబంధం ముగిసినట్టేనని స్పష్టం చేస్తున్నాయి.
‘ఇకపై నా సొంత మైదానం మొతేరా (అహ్మదాబాద్). కోల్కతాతో ఎక్కువ కాలం లేను కాబట్టి ఈడెన్ గార్డెన్స్ నా సొంత మైదానం కాదు. ప్రస్తుతం నేను గుజరాత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఇప్పుడు నా సొంత మైదానం మొతేరా స్టేడియం’ అని సాహా తెలిపాడు. బెంగాల్ తరఫున మళ్లీ ఈడెన్ గార్డెన్స్లో ఆడుతారా అనే ప్రశ్నకు ‘ఇప్పటికే ఎన్నో మ్యాచ్లు ఆడాను. కానీ ప్రస్తుతానికి వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నా’ అని సాహా బదులిచ్చాడు.