హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(బేగంపేట) వేదికగా జరుగుతున్న అంతర్రాష్ట్ర జూనియర్, సబ్జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో వ్రితి అగర్వాల్ స్వర్ణ పతకంతో మెరిసింది. శనివారం జరిగిన బాలికల 400మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన వ్రితి..4:51:33 సెకన్ల టైమింగ్తో టాప్లో నిలిచింది.
ఇదే విభాగంలో ద్రితి, నిపుణిత వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. వేర్వేరు విభాగాల్లో సాకేత్ చటర్జీ, గౌతమ్, రీతూ స్నేహల్, అశ్వత్, విలక్షణ స్వర్ణాలు సాధించారు.