స్టావేంజర్: నార్వే చెస్ టోర్నీని భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాలుగో స్థానంతో ముగించాడు. టోర్నీలో ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆనంద్.. నాలుగుకు పరిమితం కాగా అమెరికా జీఎం వెస్లీ(6.5) టైటిల్ విజేతగా నిలిచాడు.
ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్(5.5) రెండో స్థానంలో నిలిచాడు. గేమ్ల విషయానికొస్తే.. ఏడో రౌండ్లో కార్ల్సన్పై ఆనంద్ విజయం సాధించాడు. మొత్తం పది మంది గ్రాండ్మాస్టర్లు పోటీపడ్డ టోర్నీలో ఆనంద్ ప్రస్థానం పడుతూ లేస్తూ సాగింది. తొలి రౌండ్లో ఆర్యన్(నార్వే)పై గెలిచి బోణీ కొట్టిన విషీ అదే జోరును కొనసాగించడంలో విఫలమయ్యాడు.మంగళవారం నుంచి మొదలయ్యే క్లాసికల్ ఈవెంట్లో తన తొలి గేమ్లో వాచైర్ లాగ్రేవ్తో ఆనంద్ తలపడుతాడు.