అమరావతి : విశాఖపట్నం(Visakapatnam)లో ఆదివారం జరుగనున్న రెండవ వన్ డే పోటీలో తలపడేందుకు భారత్(India), ఆస్ట్రేలియా(Australia) జట్లు శనివారం రాత్రి విశాఖకు చేరుకున్నాయి. ఈ రెండు జట్లు విమానాశ్రయం నుంచి ప్రత్యేక భద్రత(Special Police) మధ్య హోటల్కు చేరుకున్నాయి. రుషికొండ సాగరతీరంలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఇరుజట్లకు బస కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు విమానశ్రయం వద్ద ఇరు జట్లకు ఘన స్వాగతం పలికారు.
ఇప్పటికే ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచిన విషయం తెలిసిందే. ఆదివారం రెండో మ్యాచ్ విశాఖలో, మూడో మ్యాచ్ 22న గుజరాత్లోని అహ్మద్బాద్ స్టేడియంలో జరుగనున్నది. నాలుగు టెస్ట్ మ్యాచ్ సీరిస్లో భాగంగా రెండు భారత్, ఒకటి ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించగా ఒక మ్యాచ్ డ్రా అయ్యింది. దీంతో టెస్ట్ సీరిస్ భారత్ కైవసం చేసుకుంది.