Virender Sehwag | ఇటీవల కీలక మ్యాచుల్లో టీమిండియా ఓడిపోతూ అభిమానుల్ని తీవ్ర నిరాశపరుస్తున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లోనూ భారత జట్టు ఘోరంగా విఫలమైంది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తొలి వన్డేలో పరాజయం పాలైన భారత క్రికెట్ జట్టు.. బుధవారం బంగ్లాదేశ్తో రెండో మ్యాచ్లోనూ తడబాటుకు గురైంది. 5 పరుగుల తేడాతో బంగ్లా చేతిలో ఓటమిపాలైంది. దీంతో సిరీస్ను 2-0తో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది.
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ముందు.. టీమిండియా విఫలమవుతుండటం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ సేన వైఫల్యంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశారు. జట్టును క్రిప్టో కరెన్సీతో పోల్చారు. ‘టీమిండియా జట్టు ప్రదర్శన క్రిప్టో కరెన్సీకంటే దారుణంగా పడిపోతోంది. ఇప్పుడు జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు.
బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 5 పరుగుల తేడాతో బంగ్లా చేతిలో ఓటమిపాలైంది. బంగ్లా నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 266/9 స్కోరుకు పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ (82), అక్షర్పటేల్ (56), రోహిత్శర్మ (51 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు.
Cryptos se bhi tez gir rahi hai apni performance yaar. Need to shake up – wake up.
— Virender Sehwag (@virendersehwag) December 7, 2022