అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ పోరు అనంతరం మైదానంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ తన జెర్సీని పాక్ సారథి బాబర్ ఆజమ్కు అందించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే.. పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ మాత్రం బాబర్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. జెర్సీ తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదని.. అంతగా కావాలనుకుంటే డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘మ్యాచ్ అనంతరం గ్రౌండ్లో కోహ్లీ నుంచి బాబర్ జెర్సీ తీసుకోకుండా ఉండాల్సింది. ఎందుకుంటే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. డ్రెస్సింగ్ రూమ్ వద్దనో లాబీలోనో తీసుకోవాల్సింది. మీ బంధువుల అబ్బాయి ఎవరైనా కోహ్లీ జెర్సీ అడిగి ఉంటే.. ఆట అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వద్ద ప్రైవేట్గానే ఆ జెర్సీ తీసుకోవాల్సింది’ అని అక్రమ్ పేర్కొన్నాడు.