అంతర్జాతీయ క్రికెట్ లో ఒకప్పుడు అలవోకగా సెంచరీలు చేసిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ సుమారు మూడేండ్లుగా అదేదో తన పని కాదన్నట్టు చతికిలపడుతున్నాడు. శతకం సంగతి పక్కనబెడితే కనీసం హాఫ్ సెంచరీ చేసినా చాలనుకునే స్థాయికి వచ్చారు అతడి అభిమానులు. అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ చివరిసారి సెంచరీ చేసింది 2019 సెప్టెంబర్ లో. సుమారు 110 ఇన్నింగ్స్ (ఐపీఎల్ తో కలిపి) దాటినా విరాటుడు ఇంకా గర్వంగా బ్యాట్ పైకెత్తలేదు. అయితే కోహ్లీ 71వ సెంచరీ కోసం ఒక మహిళ చేస్తున్నపని నెటిజన్లకు ఆకర్షిస్తున్నది.
కోహ్లీ అభిమాని అయిన ఓ మహిళ.. అతడు 71వ సెంచరీ చేయాలని కోరుతూ అన్నార్థులకు ఆహార ప్యాకెట్లు పంచుతున్నది. తాగం ఫౌండేషన్ అని రాసి ఉన్న ఆహార పొట్లాల మీద ‘కోహ్లీ 71వ సెంచరీ కోసం..’ అని రాసి ఆకలితో ఉన్నవారి కడుపు నింపుతున్నది. ఈ మహిళ రోడ్ల మీద ఉన్న చిన్నారులకు, ఒంటరి మహిళలకు, ఆకలితో అలమటించే వృద్ధులకు ఆహార ప్యాకెట్లు పంచుతున్నది. తద్వారా పుణ్యం కలిగి కోహ్లీ సెంచరీ చేస్తాడని ఆమె అభిలాష.
ఇందుకు సంబంధించి ఓ నెటిజన్ ఆమె ఆహార ప్యాకెట్లు పంచుతున్న ఫోటోలను షేర్ చేసి ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే ఆ మహిళది ఎక్కడ..? ఆమె పేరు..? అనే విషయాలు మాత్రం సదరు నెటిజన్ తెలపలేదు. ఏదేమైనా కోహ్లీ 71వ సెంచరీ చేస్తాడో లేదో గానీ ఆమె కోరిక మాత్రం అన్నార్థుల ఆకలి తీర్చుతున్నది. తాను చేసే పుణ్యం వల్ల కోహ్లీ మునపటి ఫామ్ ను అందుకుంటాడని ఆమె ప్రగాఢ విశ్వాసం.
ఇక పేలవ ఫామ్ తో వరుసగా విఫలమవుతున్న కోహ్లీ.. ఇంగ్లండ్ తో రీషెడ్యూల్డ్ టెస్టు, రెండు టీ20లతో పాటు లార్డ్స్ వన్డే లో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. గురువారం ముగిసిన రెండో వన్డేలో 25 బంతుల్లో 16 పరుగులు చేసి ఎప్పటిలాగే ఔటై నిరాశపరిచాడు.
A Virat Kohli fan distributing foods to some hungry people’s and children so that his wish Virat Kohli scored his 71st Century. Nice gesture from Virat’s fan and this is Crazy fan following of Kohli. 💥🔥#CricketTwitter #ViratKohli𓃵 #WestIndies #KingKohli #INDvsENG pic.twitter.com/tHs8sir7ZB
— Heinnnnnnn Sachiiiiiiiiiiiiiiii (@PranshuThakur00) July 14, 2022