టీమిండియా టెస్టు సారధి విరాటో కోహ్లీ కొంతకాలంగా ఫామ్తో అవస్థలు పడుతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు సాధించిన ఈ రన్ మెషీన్.. 71వ సెంచరీ కోసం నానా తిప్పలూ పడుతున్నాడు. కోహ్లీ బ్యాటు నుంచి సెంచరీ వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో అతని ఫామ్ గురించి టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్ స్పందించాడు.
రెండో టెస్టు ముందు జరిగిన మీడియా సమావేశంలో ద్రవిడ్ మాట్లాడాడు. కోహ్లీ ఒక్కసారి క్లిక్ అయితే అతను భారీ స్కోర్లు చేయడం చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘కొంత టైం పడుతుందంతే.. రానున్న రోజుల్లో అతన్నుంచి మంచి ప్రదర్శన చూస్తామని ఆశిస్తున్నా’’ అని ద్రవిడ్ అన్నాడు.
తనకు లభించిన శుభారంభాలను భారీ ఇన్నింగ్స్లుగా మార్చలేక ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. మంచి ఆటతీరే కనబరుస్తున్నాడని, నెట్స్లో కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడని ద్రవిడ్ వెల్లడించాడు. త్వరలోనే అతన్నుంచి భారీ స్కోర్లు చూసే అవకాశం ఉందన్నాడు.