బెంగుళూరు: ఐపీఎల్లో సోమవారం పంజాబ్ కింగ్స్ లెవన్తో జరిగిన మ్యాచ్లో బెంగుళూరు జట్టు థ్రిల్లింగ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ముగిసిన వెంటనే.. బెంగుళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తన ఫ్యామిలీతో వీడియో కాల్ మాట్లాడారు. గ్రౌండ్ నుంచి ఫోన్ చేసిన అతను.. భార్య అనుష్కా, కూతురు, కుమారుడు అకాయ్తో అతను ఫోన్లో సంభాషించాడు. చాలా సరదాగా నవ్వుతూ తన పిల్లలతో ఫోన్లో మాట్లాడారు. ఫోన్లోనే ఫ్లయింగ్ కిస్సులు కూడా కోహ్లీ ఇచ్చాడు. కుమారుడు అకాయ్తో ఫోన్లో మాట్లాడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
పంజాబ్తో మ్యాచ్లో ఫ్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు. 49 బంతుల్లో అతను 77 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో దినేశ్ కార్తీక్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ భార్య అనుష్కా శర్మ ప్రస్తుతం లండన్లో ఉన్నది. గడిచిన రెండు నెలల పాటు కోహ్లీ కూడా తన భార్యతోనే లండన్లో ఉన్న విషయం తెలిసిందే. కుమారుడికి జన్మనిచ్చిన నేపథ్యంలో వాళ్లు అక్కడ ఉన్నారు. అయితే ఐపీఎల్ కోసం కోహ్లీ ఇండియాకు రాగా, అతని ఫ్యామిలీ మాత్రం లండన్లోనే ఉన్నది.
I can’t get over on how adorable this is 🥹❤️ #ViratKohli𓃵 pic.twitter.com/gwV7Iq77At
— K k k Kiran (@kkkKiran0) March 26, 2024