Virat Kohli : న్యూజిలాండ్ టూర్కు విశ్రాంతి తీసుకున్న టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యామిలీ టైంను ఆస్వాదిస్తున్నాడు. భార్య అనుష్కా శర్మ, కూతురు వామికతో కలిసి ఉత్తరాఖండ్లో వింటర్ ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ వాటర్బాటిల్ మీద భారతజట్టు మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని ఫొటో ఉండడం గమనించాడు. ఆ విషయాన్ని అభిమానులతో పంచుకోవాలని ధోని ఫొటో ఉన్న వాటర్బాటిల్ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అతను అన్ని చోట్ల ఉన్నాడు. నీళ్ల బాటిల్ మీద కూడా అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఏడాది మొదట్లో ఫామ్లేమితో విరాట్ కోహ్లీ తన కెరీర్లో మొదటిసారి నెల రోజులకు పైగా క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ఆసియా కప్, టీ 20 వరల్డ్కప్లో మునపటి కోహ్లీని గుర్తుచేశాడు. ఫామ్ అందిపుచ్చుకున్న కోహ్లీ అక్టోబర్ నెలలో ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు మొదటిసారి గెలుచుకున్నాడు.
ఈ ఏడాది సెప్టెంబర్లో విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో తనకు ధోని మాత్రమే మెసేజ్ చేశాడని కోహ్లీ వెల్లడించాడు. కోహ్లీ-ధోనీ జోడీ ఛేజింగ్లో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. వీళ్లిద్దరు మంచి స్నేహితులు కూడా. 2000 ఆగష్టులో ధోని టీమిండియాకు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు.