టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. తాజాగా షేర్ చేసిన ఒక ఫొటో నెట్టింట వైరల్గా మారింది. టీ20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ నుంచి కొంత విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. కుటుంబంతో సమయం గడిపాడు. అనంతరం న్యూజిల్యాండ్తో జరిగే రెండో టెస్టు కోసం ఇప్పుడు కసరత్తులు చేస్తున్నాడు.
బ్రేక్ సమయంలో తన ప్రైవేట్ లైఫ్కు సంబంధించి అభిమానులకు కొన్ని గ్లింప్స్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే భార్య అనుష్క శర్మతో కలిసి ఒక నది పక్కనే కూర్చొని ఉన్న ఫొటోను కోహ్లీ తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశాడు. దానికి ‘నువ్వు పక్కనుంటే ఎక్కడున్నా అది ఇల్లే’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
ఇది చూసిన కోహ్లీ అభిమానులు రెచ్చిపోతున్నారు. దీంతో ఆ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ ఫొటోకు సుమారు 30 లక్షల మంది లైక్ కొట్టారు.