సెంచూరియన్: దక్షిణాఫ్రికా టూర్కు వెళ్లిన టీమిండియా క్రికెటర్లు తమ ట్రైనింగ్ సెషన్ను మొదలుపెట్టారు. డిసెంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభంకానున్న బాక్సింగ్ డే టెస్టుకు కోహ్లీసేన ప్రిపేరవుతోంది. అయితే క్రికెటర్ల శిక్షణకు సంబంధించి బీసీసీఐ తన ట్విట్టర్లో ఒక వీడియోను పోస్టు చేసింది. టీమిండియా క్రికెటర్లు ఆడుతూ పాడుతూ ఎలా తమ శిక్షణ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారో ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. రొటీన్ రీతిలో కాకుండా.. చాలా భిన్నమైన రీతిలో ఈసారి క్రికెటర్లు ఫిట్నెస్ సెషన్లో పాల్గొన్నారు. రెండు జట్లుగా మారిన టీమిండియా క్రికెటర్లు ఫూట్వాలీబాల్ ఆడారు. కాలితో వాలీబాల్ను తన్నుడూ తన గేమ్ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రిషబ్ పంత్, ఇశాంత్ శర్మ ఇంకా ఇతర ఆటగాళ్లు పాల్గొన్నారు. కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఫూట్వాలీబాల్ గేమ్లో తన ట్యాలెంట్ను చూపించాడు. నిజానికి బీసీసీఐ, కోహ్లీ మధ్య కెప్టెన్సీ వార్ నడుస్తున్నా.. క్రికెటర్లు మాత్రం లైటర్ మూడ్లో వర్కౌట్ చేస్తూ దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టుకు సంసిద్ధమయ్యారు.
How did #TeamIndia recharge their batteries ahead of their first training session in Jo'Burg? 🤔
— BCCI (@BCCI) December 18, 2021
On your marks, get set & Footvolley! ☺️😎👏👌#SAvIND pic.twitter.com/dIyn8y1wtz