ఫామ్లేమితో సతమతం అవుతున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. త్వరలోనే స్పెషల్ ఇన్నింగ్స్ ఆడతాడని ఇంగ్లండ్ మాజీ దిగ్గజం మైకేల్ వాగన్ అన్నాడు. మంగళవారం నుంచి ఇంగ్లండ్తో టీమిండియా వన్డే సిరీస్ ఆడనున్న నేపథ్యంలో మైకేల్ వాగన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
భారత జట్టుకు కోహ్లీ ఫామ్లోకి రావడం అత్యవసరమని చెప్పిన ఈ ఇంగ్లండ్ మాజీ సారధి.. అతను పరుగులు చేయడం చాలా ముఖ్యమన్నాడు. ‘‘కొన్నేళ్ల క్రితం వరకూ వైట్ బాల్ క్రికెట్ చరిత్రలోనే ఛేజింగ్లో మాస్టర్ అని కోహ్లీని పిలిచాం. ఇప్పుడు కూడా అతను ఆ స్పెషల్ ఇన్నింగ్స్కు కొద్ది దూరంలోనే ఉన్నాడనే గ్లింప్స్ నాకు కనిపించాయి.
ఈ సిరీస్లో అది జరుగుతుందని ఆశిస్తున్నా. విరాట్ నిలకడగా స్కోర్ చేయాలి కోరుతున్నా’’ అని మైకేల్ వాగన్ చెప్పాడు. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో కూడా కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. తొలి మ్యాచ్కు దూరమైన అతను.. రెండో మ్యాచ్లో ఒక్క పరుగే చేయగా, రెండో మ్యాచ్లో 11 పరుగులకు అవుటయ్యాడు.