కేప్టౌన్: సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ చేజిక్కించుకునేందుకు టీమ్ఇండియా సమాయత్తమవుతున్నది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్లు చెరో టెస్టు నెగ్గగా.. మంగళవారం నుంచి కేప్టౌన్ వేదికగా ఆఖరి పోరు ప్రారంభం కానుంది. నిర్ణయాత్మక పోరు కోసం శనివారమే ఇక్కడికి చేరుకున్న భారత జట్టు.. ఆదివారం మైదానంలో చెమటోడ్చింది. వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన కోహ్లీ నెట్స్లో తీవ్రంగా శ్రమించగా.. సీనియర్ ఆటగాళ్లు పుజరా, రహానే హెడ్ కోచ్ ద్రవిడ్తో చర్చిస్తూ కనిపించారు. కండరాలు పట్టేయడంతో జొహన్నెస్బర్గ్ మ్యాచ్లో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయలేకపోయిన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఫిట్నెస్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ అతడు అందుబాటులో లేకపోతే.. ఇషాంత్, ఉమేశ్లో ఒకరికి తుది జట్టులో చాన్స్ దక్కనుంది.