హైదరాబాద్: ఐపీఎల్లో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ..ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 62 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అతని ఇన్నింగ్స్లో నాలుగు సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి. హైదరాబాద్ విసిరిన భారీ టార్గెట్ను .. ఆర్సీబీ ఈజీగా చేజ్ చేసింది. తొలి వికెట్కు కోహ్లీ, డూప్లెసిస్లు 172 రన్స్ జోడించారు.
భారీ షాట్లతో అలరించిన కోహ్లీపై .. భార్య అనుష్కా శర్మ(Anushka Sharma) కామెంట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనదైన స్టయిల్లో మెసేజ్ ఇచ్చింది. కోహ్లీ దూకుడుమీదున్నాడని అనుష్కా తన కామెంట్లో పేర్కొన్నది. ఈ ఈజ్ అంటూ ఓ బాంబు ఎమోజీని పోస్టు చేసింది. ఇక ఆ ఇన్నింగ్స్ కూడా అద్భుతమని పేర్కొన్నది. లవ్ ఎమోజీతో పాటు 100 సంఖ్యను వేసి కోహ్లీ ఇన్నింగ్స్పై స్వీట్ కామెంట్ చేసిందామె.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 186 రన్స్ చేసింది. ఓ దశలో అయిదు ఓవర్లలో 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ను క్లాసెస్ ఆదుకున్నాడు. క్లాసన్ 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అతని ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.