ఐపీఎల్లో టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రెండు జట్ల ఆటగాళ్లు కలిశారు. జీటీ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా.. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మాటల అనంతరం కోహ్లీ తనకు బ్యాట్ గిఫ్ట్ ఇచ్చాడని రషీద్ ఖాన్ వెల్లడించాడు.
దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడీ ఆఫ్ఘానీ స్పిన్నర్. ‘‘నిన్ను ఎప్పుడు కలిసినా సంతోషంగా ఉంటుంది.. గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్’’ అని రషీద్ ఖాన్ పోస్టు చేశాడు.
దీనిపై మరో ఆఫ్ఘానీ పేసర్, ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున ఆడుతున్న ఫజల్లాఖ్ ఫరూఖీ స్పందిస్తూ.. ‘‘క్రికెట్లోని ఇద్దరు కింగ్స్’’ అని కామెంట్ చేశాడు. ప్రముఖ ప్రెజెంటర్ అయిన ఎరిన్ హోలాండ్.. ‘‘సూపర్స్టార్స్’’ అని మెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.