మొహాలీ: విరాట్ కోహ్లీకి అభిమానులు ఎక్కువే. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ విజయం తర్వాత విరాట్ కోహ్లీ తన జెర్సీని ఓ దివ్యాంగ అభిమానికి గిఫ్ట్గా ఇచ్చాడు. మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో వందో టెస్టు ఆడిన కోహ్లీ.. ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ బస్సు ఎక్కే సమయంలో అక్కడ ఉన్న అతని అభిమాని ధరమ్వీర్ పాల్కు తన జెర్సీని బహుమతిగా ఇచ్చేశాడు. ఇక సోషల్ మీడియాలో కోహ్లీపై ప్రశంసలు కురుస్తున్నాయి. కోహ్లీ తనకు జెర్సీని గిఫ్ట్ ఇచ్చిన విషయాన్ని ధరమ్వీర్ తన ట్విట్టర్లో షేర్ చేశాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ 45 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
Wow it's great day my life @imVkohli he's 100th test match he's gifts me t shirts wow 😲 #viratkholi #ViratKohli100thTest #KingKohli pic.twitter.com/mxALApy89H
— dharamofficialcricket (@dharmveerpal) March 6, 2022