డోమినిక్: ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కొత్త మైలురానియి అందుకున్నాడు. టెస్టుల్లో టాప్ 5 ఇండియన్ బ్యాటర్ల జాబితాలోకి చేరుకున్నాడు. విండీస్తో జరిగిన టెస్టు మ్యాచ్లో కోహ్లీ 76 రన్స్ చేశాడు. దీంతో అతను సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో సెహ్వాగ్ 8503 రన్స్ చేసి అయిదో స్థానంలో ఉన్నాడు. ఆ మైలురాయిని కోహ్లీ దాటేశాడు. కోహ్లీ కన్నా ముందు వరుసలో సచిన్ టెండూల్కర్(15921), రాహుల్ ద్రావిడ్(13265), సునిల్ గవాస్కర్(10122), వీవీఎస్ లక్ష్మణ్(8781) ఉన్నారు.
విండీస్తో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ హీరో జైస్వాల్తో కలిసి మూడ వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఆ ఇద్దరూ 110 రన్స్ జోడించారు.