Virat Kohli | న్యూఢిల్లీ: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఎక్కడ లేని ఫ్యాన్స్ ఫాలోయింగ్. ప్రపంచంలోనే ఎక్కడికి వెళ్లినా తమ అభిమాన క్రికెటర్ను కలువాలనే తపనే. ఆటతోనే కాదు ఆహార్యంలోనూ హ్యండ్సమ్గా ఉండే విరాట్ అంటే అమ్మాయిలకు ఫిదా. అసలు విషయానికొస్తే ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉన్న కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఓ అమ్మాయి ముద్దుపెట్టుకోవడం హాట్టాపిక్గా మారింది. కోహ్లీకి ముద్దు ఇస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా ఆ అమ్మాయిపై కోహ్లీ భార్య అనుష్కశర్మ కేసు పెట్టాలని ఒకరు అంటే..మరొకరు పరువునష్టం వేయాలని పోస్ట్లు పెడుతున్నారు. మొత్తానికి కోహ్లీతో స్వయంగా కాకపోయినా..విగ్రహానికి ముద్దు ఇచ్చి సదరు ముద్దుగుమ్మ తన ముచ్చట తీర్చుకుంది.