Virat Kohli : అచ్చం తనను పోలిన వ్యక్తి పుమా ప్రొడక్ట్స్ అమ్మడం పట్ల విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాంటి పనులు చేయొద్దని కోరాడు. టీ షర్ట్, షార్ట్ వేసుకున్న వ్యక్తి ముంబైలో పుమా కంపనీ వస్తువులను అమ్ముతున్నాడు. అక్కడికి వచ్చిన వాళ్లతో సెల్ఫీలు దిగడమే కాకుండా ఆటోగ్రాఫ్లు ఇస్తూ కనిపించాడు. ‘హే పుమా ఇండియా. అచ్చం నన్ను పోలిన ఒక వ్యక్తి ముంబైలోని లింక్రోడ్డు దగ్గర పుమా ప్రొడక్ట్స్ అమ్ముతున్నాడు. దయచేసి ఈ విషయంపై దృష్టిపెట్టండి’ అంటూ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్కు పుమా కంపెనీని ట్యాగ్ చేశాడు.
బ్లాక్ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా పుమా కంపెనీ ఇదంతా ప్లాన్ చేసిందని తెలిసింది. తమ కంపెనీ ప్రచారకర్తలుగా ఉన్న కరీనా కపూర్, సునీల్ ఛెత్రీ, యువరాజ్ సింగ్లను పోలిన వ్యక్తులతో ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్లో అచ్చం ఇలాంటి కార్యక్రమాన్నేనిర్వహించింది. ‘ఏం జరుగుతోంది పుమా ఇండియా. నేను మీకు టైం ఇవ్వలేదు కదా! ఎవరు ఈ నకలు యువరాజ్ సింగ్ అంటూ’ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యంగ్యంగా స్పందించాడు. పుమా అనేది జర్మనీకి చెందిన కంపెనీ.