అడిలైడ్: విరాట్ కోహ్లీ(Virat Kohli) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్కప్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా నిలిచాడు. శ్రీలంక బ్యాటర్ మహెళ జయవర్ధణే పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. టీ20 వరల్డ్కప్ మ్యాచుల్లో జయవర్ధణే 1016 రన్స్ చేశాడు. 31 ఇన్నింగ్స్లో అతను ఆ పరుగులు సాధించాడు. అయితే కోహ్లీ ఆ రికార్డును కేవలం 25వ ఇన్నింగ్స్లోనే దాటేశాడు. బంగ్లాతో మ్యాచ్లో 16 రన్స్ చేయగానే.. వరల్డ్కప్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా కోహ్లీ సరికొత్త మైలురాయిని అందుకున్నాడు.
MILESTONE ALERT 🚨
Virat Kohli becomes the leading run-scorer in ICC Men's #T20WorldCup history, overtaking Mahela Jayawardena 🌟#INDvBAN pic.twitter.com/xDO0HNK5o3
— T20 World Cup (@T20WorldCup) November 2, 2022
2014, 2016 వరల్డ్కప్ మ్యాచుల్లో విరాట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2014లో కోహ్లీనే లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఆ టోర్నీలో కోహ్లీ అత్యధికంగా 319 రన్స్ చేశాడు. అయితే ఆ టోర్నీలో ఫైనల్లో శ్రీలంక చేతిలో ఇండియా ఓడిపోయింది. 2016లో కోహ్లీ రెండవ స్థానంలో నిలిచాడు. ఆ ఎడిషన్లో అతను 273 రన్స్ చేశాడు. కొత్త మైలురాయిని చేరుకున్న కోహ్లీకి బీసీసీఐ కంగ్రాట్స్ తెలిపింది.