ముంబై: ఐపీఎల్ 19 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ.. మైదానంలో ఆటగాళ్ల వ్యక్తిగత సంభాషణలను బ్రాడ్ కాస్టర్ కెమెరా రహస్యంగా రికార్డ్ చేయడంపై ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇటీవల లక్నో జ సలహాదారు కేన్ విలియమ్సన్తో కోహ్లీ మైదానంలో మాట్లాడుతున్న సమయంలో ఒక కెమెరా ఇద్దరి సంభాషణను చాలా దగ్గరగా క్యాప్చర్ చేయడంపై కోహ్లీ ఘాటుగా స్పందించాడు.
ఇలాంటి వ్యక్తిగత విషయాల్లోకి కెమెరాలతో చొరబడటం తనను ఎంతగానో ఇబ్బందికి గురిచేస్తోందని కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. మైదానంలో మ్యాచ్ ముగిసిన తర్వాత లేదా ప్రాక్టీస్ సమయాల్లో సహచర అంతర్జాతీయ ఆటగాళ్లతో మాట్లాడేటప్పుడు కనీస ప్రైవసీ లేకుండా పోతోందని కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మేము స్నేహపూర్వకంగా మాట్లాడుకునే మాటలను కూడా పెద్ద విషయాలుగా చిత్రీకరిస్తున్నారు. ఇలా ప్రతి క్షణాన్ని కెమెరాలతో వెంబడించడం అస్సలు సౌకర్యంగా లేదు’ అని కోహ్లీ ఆర్సీబీ పాడ్కాస్ట్లో పేర్కొన్నాడు.