దుబాయ్: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న ఇషాన్ కిషన్.. టీ20 వరల్డ్కప్ కోసం సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా జట్టుకు ఓపెనర్గా ఆడేందుకే తనను సెలెక్ట్ చేసినట్లు ఇషాన్ చెప్పాడు. విరాట్ భాయ్ (కోహ్లీ) తనకు ఈ విషయం చెప్పినట్లు ఓ సందర్భంలో ఇషాన్ కిషన్ గుర్తు చేశాడు. నిజానికి ఈ ఏడాది ఐపిఎల్లో ఇషాన్ పెద్దగా రాణించలేదు. ఓ దశలో అతన్ని తుది జట్టు నుంచి తప్పించారు. అయితే అబుదాబిలో శుక్రవారం హైదరాబాద్ సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఇషాన్ తన సత్తా చాటాడు. శరవేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 32 బంతుల్లో 84 రన్స్ చేశాడు. దాంట్లో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.
టీ20 వరల్డ్కప్ ప్రారంభానికి ముందు ఇషాన్ ఫామ్లోకి రావడం సంతోషకర విషయం. విరాట్ భాయ్, బుమ్రా భాయ్తో చాటింగ్ చేశానని, హార్డిక్, పోలార్డ్లు కూడా తనకు మంచి సపోర్ట్ ఇచ్చారని, సీనియర్లు చాలా హెల్ప్ చేశారని ఇషాన్ తెలిపాడు. నేర్చుకునే దశలో ఉన్నానని, పొరపాట్లు మళ్లీ దొర్లకుండా చూసుకోవాలని సీనియర్లు చెప్పినట్లు ఇషాన్ పేర్కొన్నాడు. వరల్డ్కప్ జట్టు కోసం ఓపెనర్గా తనను సెలెక్ట్ చేసినట్లు విరాట్ కోహ్లీ తనతో చెప్పినట్లు ఇషాన్ తెలిపాడు.