ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబుల్ హసన్ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను జట్టు కెప్టెన్ అయినప్పటి నుంచి బంగ్లాదేశ్ మంచి ప్రదర్శన చేస్తున్నది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో కూడా శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి టీ20లో బంగ్లా టీమ్ ఇంగ్లండ్పై సంచలన విజయం సాధించింది.
అయితే, ఆటలో అద్భుతంగా రాణిస్తున్న షకీబ్.. వివాదాల్లోనూ అదే జోరు కనబరుస్తున్నాడు. క్రికెట్ ఫీల్డ్లోగానీ, వ్యక్తిగత జీవితంలోగానీ అతని ప్రవర్తన వివాదాస్పదంగానే ఉంటుంది. ఎప్పుడూ సహనం కోల్పోతూ ఏదో ఒక వివాదానికి అతను కేంద్ర బిందువుగా మారుతుంటాడు. తాజాగా షీకబ్ మరోసారి సహనం కోల్పోయాడు.
ఇవాళ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన షకీబ్ను అభిమానులు చుట్టుముట్టారు. అతడిని చూసేందుకు ఎగబడి ముందుకు తోసుకొచ్చారు. దాంతో షకీబ్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. చుట్టూ పకడ్బంధీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ టోపీ తీసుకుని ఓ అభిమానిపై దాడి చేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.