న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ను టోక్యో కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ముగిసిన ఒలింపిక్స్లో ఓటమిపాలై, క్రమశిక్షణ ఉల్లంఘనల కారణంగా తాత్కాలిక నిషేధం ఎదుర్కొన్న ఆమె.. తాజాగా త్వరలో జరిగే ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ టోర్నీకి అర్హత సాధించడంలో విఫలమైంది. అర్హత పోటీల్లో భాగంగా తొలిరౌండ్లో 10-5 తేడాతో అంజు మీద నెగ్గిన వినేశ్.. మంగళవారం జరిగిన 55 కిలోల విభాగం పోరులో ఓటమిపాలైంది. ఈ పోటీలో విజయం సాధించిన పింకీ.. చాంపియన్షిప్నకు అర్హత సాదించింది.