HCA | హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా భారత్ – న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరుగనున్నది. వన్డే మ్యాచ్కు ముందే హెచ్ఏసీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్పై ప్రధాన కార్యదర్శి విజయ్ ఆనంద్ సంచలన ఆరోపణలు చేశారు. అజార్ ఒంటెత్తు పోకడలపై మండిపడ్డారు. ఉప్పల్లో మ్యాచ్ విషయమై కార్యదర్శి అయిన తనను సంప్రదించలేదని, బెదిరించి చెక్కులపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు.
కులం పేరిట చిన్నచూపు చూస్తూ.. ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. మ్యాచ్ టికెట్లను పక్కదారి పట్టిస్తున్నారని, ఆన్లైన్ టికెట్లలో కూడా గోల్మాల్ జరిగిందని, తనతో పాటు ప్యానెల్ మొత్తాన్ని పక్కనపెట్టారని విజయ్ ఆనంద్ ఆరోపించారు. జనరల్ సెక్రెటరీగా తన విధులు అధ్యక్షుడితో సమానంగా ఉన్నాయన్న విజయ్ ఆనంద్.. తనను లెక్క చేయకుండా అజారుద్దీన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మ్యాచ్కు ముందే హెచ్సీఏలో విభేదాలు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలతో హైదరాబాద్ క్రికెట్ను భ్రష్టుపట్టిస్తున్నారని, రంజీ ట్రోఫీలో జట్టు ప్రదర్శనకు ఈ రాజకీయాలే కారణమంటూ అభిమానులు మండిపడుతున్నారు.