జైపూర్: విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 17 పరుగుల తేడాతో జార్ఖండ్పై విజయం సాధించింది. తొ లుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(112) సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 297 పరుగులు చేసిం ది.
రోహిత్రాయుడు త్వరగా ని ష్క్రమించగా, కెప్టెన్ రాహుల్ సింగ్తో కలిసి తన్మయ్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. రెండో వికెట్కు వీరిద్దరు కలిసి 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన జార్ఖండ్ 8 వికెట్లకు 280 పరుగులకు పరిమితమైంది. సౌరభ్ తివారీ (78), ఆర్యమన్సేన్ (63), విశాల్ (61) అర్ధసెంచరీలతో రాణించారు. రోహిత్ రాయు డు(3/48), రవితేజ(2/63) రాణించారు.