సుబేదార్ నీరజ్ చోప్రా.. ఒలింపిక్స్లో భారతదేశానికి బంగారు పతకం సాధించిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. ప్రపంచ అథ్లెటిక్స్ ప్రకారం అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉన్నాడు. చోప్రా భారత సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్. ఆటతోనేకాదు తన సత్ప్రవర్తనతోనూ ఫ్యాన్స్ మనసు దోచుకుంటున్నాడు. నీరజ్ చోప్రా. తన ఫ్యాన్స్కు ఎంత గౌరవమిస్తాడో తెలిపే ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘యువర్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో నీరజ్ చోప్రా తన అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతున్నాడు. చాలా మర్యాదపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు అని చెప్పడం వినవచ్చు. దీని తర్వాత అతడు అక్కడున్నవారితో కరచాలనం చేశాడు. చివరగా ఓ వృద్ధుడు కనిపించగానే అతడి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది. ఇప్పటివరకూ ఈ వీడియోను 47వేల మంది వీక్షించారు. నీరజ్ చోప్రా.. డౌన్ టు ఎర్త్ వ్యక్తి అని నెటిజన్లు కొనియాడుతున్నారు.
So down to earth this person @Neeraj_chopra1 ❣️Took blessing from an elderly fan. That speaks volumes. Love you ❤️ pic.twitter.com/jjo9OxHABt
— Your ❤️ (@ijnani) June 30, 2022