ముంబై: బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ కోసం మూడో టెస్టు వేదికను ఇండోర్కు మార్చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరగాల్సిన ఆ మ్యాచ్ను .. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరగనున్నట్లు ఇవాళ బీసీసీఐ కార్యదర్శి జేషా తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 1న ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతంలో శీతాకాల ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టంగా ఉన్నాయని, ఔట్ఫీల్డ్లో కావాల్సినంత గడ్డిలేదని బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు.
NEWS – Venue for third Test of the @mastercardindia Australia tour of India for Border-Gavaskar Trophy shifted to Indore from Dharamsala. #INDvAUS
More details here – https://t.co/qyx2H6N4vT pic.twitter.com/N3W00ukvYJ
— BCCI (@BCCI) February 13, 2023
ఈ మధ్యే ధర్మశాల గ్రౌండ్కు మరమ్మతులు చేశారు. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించేందుకు స్టేడియం ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని తెలుస్తోంది. దీంతో ఈ మ్యాచ్ను ఇండోర్లో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది.
భారత్లోని ఎత్తైన స్టేడియంగా గుర్తంపు తెచ్చుకున్న ధర్మశాలలో ఇప్పటివరకూ ఒకే ఒక టెస్టు జరిగింది. అది కూడా 2017లో. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించి 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక రెండు టీ20 మ్యాచ్లు ఆడాయి.