అంటాల్యా: ఆర్చరీ ప్రపంచకప్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత కాంపౌడ్ విభాగంలో సెమీఫైనల్కు దూసుకెళ్లగా.. పురుషుల రికర్వ్ జట్టు తుది పోరుకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ రౌండ్లో ప్రపంచ రికార్డు స్కోరుతో ముందంజ వేసిన జ్యోతి సురేఖ.. వరుసగా నాలుగు విజయాలు ఖాతాలో వేసుకొని సెమీఫైనల్కు చేరింది.
సెమీస్లో శనివారం ప్రపంచ నంబర్వన్ ఎల్లా గిబ్సన్ (ఇంగ్లండ్)తో సురేఖ తలపడనుంది. గురువారం జరిగిన రికర్వ్ పోటీల్లో అతాను దాస్, ధీరజ్, తరుణ్దీప్ రాయ్తో కూడిన భారత పురుషుల జట్టు.. 9 ఏండ్ల తర్వాత ఫైనల్కు అర్హత సాధించింది. సెమీస్లో మన జట్టు 5-4 (29-28)తో జపాన్పై విజయం సాధించింది. ఆదివారం జరుగనున్న ఫైనల్లో మన ఆర్చర్లు.. చైనా ఆర్చర్లతో అమీతుమీ తేల్చుకోనున్నారు.