బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు అవాంతరం ఎదురైంది. సబ్బినేని మేఘన, పూజ వస్ర్తాకర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో బర్మింగ్హామ్కు బయల్దేరిన టీమ్ఇండియా నుంచి వీరిద్దరిని మినహాయించారు. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారు. కొవిడ్-19 నెగెటివ్ తేలిన తర్వాత వీరు ఇంగ్లండ్కు బయల్దేరి వెళ్తారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. మెగాటోర్నీలో తమ తొలి పోరులో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జూలై 31న, బార్బడోస్తో ఆగస్టు 3న భారత్ మ్యాచ్లు ఆడుతుంది. ఫైనల్ సహా మ్యాచ్లన్నీ ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతాయి. టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లకు టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయని నిర్వాహకులు పేర్కొన్నారు.