న్యూఢిల్లీ: ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ సీజన్-16లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కి కాసుల పంట పండుతోంది. జరిమానాల రూపంలో బీసీసీఐ ఖజానాకు లక్షల్లో జమ అవుతున్నాయి. ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినందుకు ఈ సీజన్లో ఇప్పటివరకు రూ.కోటికి పైగా జరిమానాలు వసూలయ్యాయి. స్లో ఓవర్ రేట్ కారణంగా వివిధ జట్ల కెప్టెన్లు జరిమానాలు చెల్లించారు.
తాజాగా సోమవారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ నితీశ్ రాణాకు స్లో ఓవర్ రేట్కుగాను రూ.12 లక్షల జరిమానా విధించారు. దాంతో కలిపి ఈ సీజన్లో ఇప్పటివరకు బీసీసీఐకి వచ్చిన స్లో ఓవర్ రేట్ జరిమానాల మొత్తం రూ.1.08 కోట్లకు చేరింది. నితీశ్ రాణా కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల కెప్టెన్లు తలా రూ.12 లక్షల చొప్పున జరిమానాలు చెల్లించారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్లు అయితే మూడు సార్లు స్లో ఓవర్లు వేయించి మొత్తం రూ.36 లక్షలు ఫైన్ కట్టారు.