న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణ పతకం అందించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. వచ్చే విశ్వక్రీడల (పారిస్ 2024) వరకు తన కోచ్ క్లాజ్ బార్టోనిట్జ్ (జర్మనీ)తోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. గోల్డెన్ బాయ్ నీరజ్ శుక్రవారం ఓ ప్రముఖ వార్తసంస్థ కాన్క్లేవ్లో మాట్లాడుతూ.. ‘శిక్షణ సమయంలో మరీ కఠినంగా ఉండటాన్ని నేను ఇష్టపడను. కొందరు కోచ్లు కర్ర పట్టుకొని వెనుకే నిల్చుంటారు. కానీ క్లాజ్ అలా కాదు. ఇప్పుడు ఎలా ఉండాలో ఆయనకు బాగా తెలుసు. సరదాగా ఉన్నప్పుడు జోక్స్ వేయడంతో పాటు.. అవసరమైన సమయంలో శిక్షణలో తీవ్రత పెంచుతారు. ఆయన శిక్షణ పద్ధతులు నాకు సరిగ్గా సరిపోతాయి’ అని అన్నాడు.