హైదరాబాద్, ఆట ప్రతినిధి: తిరువనంతపురం వేదికగా జరుగుతున్న జాతీయ సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన సురభి భరద్వాజ్ స్వర్ణ పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన మహిళల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో సురభి అద్భుత ప్రదర్శన కనబరిచింది.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో 590 పాయింట్ల తేడాతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని ముద్దాడింది. సీనియర్ టోర్నీలో ఇది జాతీయ రికార్డు కావడం విశేషం. మేఘన సజ్జనార్ (586), నిశ్చల్ (585) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఖేలో ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో సురభి కాంస్య పతకం దక్కించుకుంది.