Uppal Test Match | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 25 నుంచి మొదలయ్యే భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 18 నుంచి టెస్టు మ్యాచ్ టికెట్లు అభిమానులకు అందుబాటులో ఉంటాయని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు ఆదివారం పేర్కొన్నారు. పేటీఎమ్ ఇన్సైడర్ మొబైల్ యాప్తో పాటు వెబ్సైట్ www.insider.in టికెట్లు విక్రయించనున్నారు.
జింఖానాలో ఈ నెల 22 నుంచి ఆఫ్లైన్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. టెస్టు మ్యాచ్ టికెట్ ధర కనిష్ఠంగా రూ.200 కాగా, గరిష్టంగా 4వేలుగా నిర్ణయించారు. సామాన్యులకు అందుబాటులో ఉంటాయని జగన్ తెలిపారు. ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా భారత సాయుధ దళాలకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. 25 వేల మంది విద్యార్థులకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు.