బెంగళూరు: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఘన విజయంతో జోరు మీదున్న భారత ఫుట్బాల్ జట్టు.. దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్లో శనివారం నేపాల్తో తలపడేందుకు సిద్ధమైంది. తొలి పోరులో పాకిస్థాన్పై 4-0తో గెలుపొందిన సునీల్ ఛెత్రీ నేతృత్వంలోని భారత జట్టు.. ఈ మ్యాచ్లోనూ ఫెవరెట్గా బరిలోకి దిగనుంది.
గత మ్యాచ్లో హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించిన ఛెత్రీ మరోసారి మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు.