పుణె: బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే. వన్డేల్లో అతనికి ఇది 48వ సెంచరీ కావడం విశేషం. అయితే కోహ్లీ 97 రన్స్ వద్ద ఉన్న సమయంలో.. బంగ్లా స్పిన్నర్ నసుమ్ అహ్మద్ కావాలని వైడ్ వేశాడు. ఇండియా గెలుపుకు రెండు పరుగులు, కోహ్లీ సెంచరీకి మూడు రన్స్ అవసరమైన సమయంలో.. బంగ్లా స్పిన్నర్ కావాలనే లెగ్ సైడ్ వైడ్ బంతి వేశాడు. కానీ అంపైర్ రిచర్డ్ కెటిల్బరో ఆ బంతిని వైడ్ ఇవ్వలేదు. ఎక్స్ట్రా రన్ ఇచ్చేందుకు అంపైర్ నిరాకరించాడు. దీంతో బంగ్లా స్పిన్నర్ ప్రణాళికను అంపైర్ అడ్డుకున్నాడు. దీంతో ఒక రకంగా కోహ్లీ సెంచరీకి అంపైర్ కెటిల్బరో సహకరించినట్లు అయ్యింది. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న క్రికెటర్లు కూడా ఈ సంఘటన చూసి నవ్వుకున్నారు. ఇక ఆ ఓవర్ మూడవ బంతికి భారీ సిక్సర్ కొట్టిన కోహ్లీ సెంచరీ మార్క్ను దాటేశాడు. కోహ్లీ సెంచరీ కోసం కేఎల్ రాహుల్ కూడా కొంత సహకరించాడు. విరాట్ సెంచరీ దగ్గరపడుతున్న సమయంలో రాహుల్ కూడా రన్స్ స్కోర్ చేయలేదు.
Umpire doesn’t give wide to virat
Best moment of match. 🤣🔥🔥#INDvsBAN #ViratKohli pic.twitter.com/L621N4ciur— Saurabh Raj (@sraj57454) October 19, 2023