గీలాంగ్: టీ20 వరల్డ్ కప్ గ్రూప్ ఏలో ఇవాళ జరిగిన మ్యాచ్లో నమీబియాపై యూఏఈ ఏడు పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. నమీబియా ఓడిపోవడంతో.. గ్రూప్ ఏ నుంచి శ్రీలంకతో పాటు నెదర్లాండ్స్ సూపర్ 12 రౌండ్లోకి ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసింది. ఆ జట్టులో వసీం 50, రిజ్వాన్ 43 రన్స్ చేశారు.
🔸 Sri Lanka join England, Australia, New Zealand and Afghanistan in Group 1
🔸 Netherlands move to Group 2 which now has India, Pakistan, South Africa and BangladeshUpdated Super 12 groups 👉🏻 https://t.co/xvpQaIitkQ #T20WorldCup pic.twitter.com/wLszhhjNbw
— ICC (@ICC) October 20, 2022
ఆ తర్వాత 149 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన నమీబియా క్రమక్రమంగా వికెట్లను కోల్పోయింది. నమీబియా జట్టులో డేవిడ్ వైజ్ 55 రన్స్ చేసినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఐసీసీ వరల్డ్కప్ టోర్నీల్లో యూఏఈ విజయం సాధించడం ఇదే మొదటిసారి. వసీమ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
గ్రూప్ 1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల సరసన శ్రీలంక చేరింది. ఇక గ్రూప్ 2లో ఇండియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ సరసన నెదర్లాండ్స్ చేరింది. రేపు జరిగే గ్రూప్ బి మ్యాచ్లతో మరో రెండ్లు జట్లు సూపర్ 12కు కన్ఫర్మ్ అవుతాయి.