బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్లో బుధవారం జరిగిన పోటీలలో బెంగాల్ వారియర్స్, యూ ముంబా జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. దబాంగ్ ఢిల్లీపై బెంగాల్, గుజరాత్ జెయింట్స్పై యూ ముంబా గెలుపొందాయి.
బెంగాల్ 35-30తో ఢిల్లీ జట్టును ఓడించింది. బెంగాల్ జట్టులో మణిందర్ సింగ్ 10, వైభవ్ 6, గిరీష్ 5, అజింక్య కాప్రె 5 పాయింట్లు సాధించగా, ఢిల్లీ జట్టులో నవీన్ కుమార్ (10 పాయింట్లు) ఒంటరి పోరాటం చేశాడు. అంతకుముందు గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో యూ ముంబా 37-29 స్కోరుతో గెలుపొందింది. ముంబా జట్టులో గుమన్ సింగ్ (12) రాణించాడు.